మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా వారి పెద్ద కోడలు, రామ్ చరణ్ సతీమణి ‘అత్తమాస్ కిచెన్,’ అనే ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించారు. పులిహోర, పొంగల్, ఉప్మా, సాంబార్, రసం తదితర దక్షిణాది వంటకాలు రెడీ-మిక్స్ ప్యాకెట్ల రూపంలో ఈ ‘అత్తమాస్ కిచెన్,’ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యంత పరిశుభ్రమైన, నాణ్యమైన పధార్ధాలతో నోరూరించే ఆహార ఉత్పత్తులను తయారు చేసి ‘అత్తమాస్ కిచెన్,’ ద్వారా అందిస్తున్నామని ఉపాసన తెలిపారు.
వీటికి సంబందించి అన్ని వివరాలు https://athammaskitchen వెబ్సైట్లో చూడవచ్చని, ప్రజలు తమకు నచ్చిన వంటకాలను ఆన్లైన్లో సొమ్ము చెల్లించి బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేస్తామని ఉపాసన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి దశాబ్ధాలుగా ఆనందిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆయన సతీమణి స్వయంగా తయారుచేసిన ఈ వంటకాలను కూడా రుచి చూసి ఆనందిద్దామా?