హైదరాబాద్ నగర ప్రజలకు ఓ ముఖ్య గమనిక. నేటి నుంచి కొన్ని రోజులపాటు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్సులు తిరగవని టిఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ప్రస్తుతం నగరంలో వేసవి ఎండలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు నెలకొని వడగాడ్పులు వీస్తున్నందున ప్రజలు రోడ్లపైకి రావడం మానుకున్నారు. ఈ పరిస్థితులలో నేటి నుంచే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్ సర్వీసులను నిలిపివేయబోతున్నట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు.