ఉప్పల్ మ్యాచ్: నేడు అర్దరాత్రి వరకు మెట్రో సర్వీసులు

March 27, 2024
img

బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగబోతోంది కనుక మ్యాచ్ చూసేందుకు నగరం నలువైపుల నుంచి, చుట్టు పక్కల జిల్లాల నుంచి వేలాదిమంది ప్రజలు తరలివస్తారు. కనుక వారి సౌకర్యం కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్ సర్వీసులు అర్దరాత్రి 12.15 గంటల వరకు నడిపించబోతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు.

మెట్రోలో అన్ని మార్గాలలో చివరి రైళ్లు రాత్రి 12.15 గంటలకు తమ గమ్య స్థానాలకు బయలుదేరి 1.10 గంటలకు చేరుకుంటాయని చెప్పారు. కనుక ఐపిఎల్ ప్రేక్షకులు ఈ మెట్రో సౌకర్యాన్ని వినియోగించుకొని రాత్రి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

టిఎస్‌ఆర్టీసీ కూడా నగరం పరిధిలో అర్దరాత్రి వరకు సిటీ బస్సులు నడిపించబోతోంది. కనుక మ్యాచ్ ముగిసిన తర్వాత నగర శివార్లలో నివసించేవారు ఇళ్ళకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

Related Post