ఆదివారం నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ మద్య ప్రారంభం కాబోతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్స్, టైమింగ్స్, ఛార్జీలు ఈవిదంగా ఉండబోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి అదేవిదంగా విశాఖ నుంచి సికింద్రాబాద్కి ఎకానమీ క్లాస్ టికెట్ ఛార్జీ: 1,720.00 కాగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ఛార్జీ: రూ.3,170.00 (జీఎస్టీ, రిజర్వేషన్, కేటరింగ్ వగైరా చార్జీలన్నీ కలిపి) ఉంటుంది.
దీనిలో ఎకానమీ క్లాస్లో కేటరింగ్ ఛార్జ్ (టీ, టిఫిన్, భోజనం కలిపి) రూ.364.00, అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే రూ.419.00 ఉంటుంది. ఒకవేళ ఇవి వద్దనుకొంటే ఆ మేరకు టికెట్ ఛార్జీ తగ్గుతుంది.