రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో నేటి
నుంచి ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మద్య అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు త్వరలో ప్రారంభమయ్యాయి.
ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఏపీకి బస్సులు నడవడం మొదలయ్యాయి.ముందుగా బాగా డిమాండ్ ఉన్న
రూట్లలో బస్సులు నడిపిస్తామని ఆ తరువాత క్రమంగా అన్ని రూట్లలో నడిపిస్తామని టీఎస్ఆర్టీసీ
ఉన్నతాధికారులు తెలిపారు. నేటి నుంచి కర్ణాటకలో ఒక్క బెంగళూరు మినహా మిగిలిన ప్రాంతాలకు
బస్సులు నడిపిస్తామని తెలిపారు. మహారాష్ట్రాలో కూడా కరోనా తీవ్రత తగ్గడంతో ఆ రాష్ట్రంలో
కూడా కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో మంగళవారం నుంచి మహారాష్ట్రకు కూడా టీఎస్ఆర్టీసీ బస్
సర్వీసులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు,
సిబ్బంది కూడా విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.