రిలయన్స్ జియో మళ్ళీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్న మొబైల్ ఫోన్ను కొనుగోలు
చేసినవారికి దాంతో పాటు రెండేళ్ళపాటు ఉచిత అపరిమిత కాల్స్,
ఉచిత ఇంటర్నెట్ అందిస్తామని ప్రకటించింది. ఆ కొత్త ఫోన్ ఖరీదు కేవలం రూ.1,999
మాత్రమే. దీంతోపాటు మరో మొబైల్ ఫోన్ కూడా విడుదల చేస్తున్నామని దానిని
తీసుకొంటే 12 నెలలపాటు ఉచిత అపరిమిత కాల్స్, ఉచిత ఇంటర్నెట్ అందిస్తామని
ప్రకటించింది. ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్ వాడుతున్నారు రూ.749 పెట్టి రీఛార్జ్ చేసుకొన్నా
ఈ ఆఫర్ వర్తిస్తుందని రిలయన్స్ జియో ప్రకటించింది. ఒకసారి రూ.1,999 పెట్టి జియో ఫోన్ కొంటే మళ్ళీ రెండేళ్ళవరకు రీ-ఛార్జ్ చేసుకోనక్కరలేదు కనుక
ఇది సామాన్యప్రజలకు, ముఖ్యంగా విద్యార్దులకు చాలా ఉపయోగకరంగా
ఉంటుంది.