ఫిబ్రవరి 26వ తేదీన భారత్ బంద్

February 25, 2021
img

ఫిబ్రవరి 26వ తేదీన భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటీ) పిలుపునిచ్చింది. కేంద్రం తెచ్చిన చట్టాలు, ఇంధన ధరలు, జిఎస్టి, ఈవే బిల్లులపై నిరసనలు కేంద్రానికి తెలియజేసేందుకు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సుమారు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు బంద్‌కు మద్దతు తెలిపినట్టు సిసిఏఐటీ సభ్యులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌లు కూడా బంద్‌కు మద్దతు ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ రెబెల్ విధానాన్ని, కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్‌కు వెళ్తున్నట్టు సిఏఐటీ సభ్యులు మీడియాకు తెలిపారు.


Related Post