ఎన్టీఆర్ సినిమాకు 200 కోట్ల బడ్జెట్..!

August 10, 2020


img

R.R.R తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తాడని తెలుస్తుంది. అందులో ఒకటి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా కాగా. మరొకటి ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా. కె.జి.ఎఫ్ సినిమాతో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఆ సినిమా సెకండ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.         

ఈ సినిమాకు మైత్రి మేకర్స్ 200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎలాగు ఎన్టీఆర్ కూడా నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటాడు. అందుకే ఈ సినిమాను అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ కాగా త్వరలో సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ అదిరిపోయే ప్లానింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష