సచివాలయ నిర్మాణానికి రేపు టెండర్లు ఖరారు

October 22, 2020
img

తెలంగాణ కొత్త సచివాలయ భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. దీని కోసం ఎల్&టి మరియు షాపూర్‌జీ సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. నిబందనల ప్రకారం మంగళవారం ముందుగా ఆ రెండు సంస్థలు దాఖలు చేసిన సాంకేతికపరమైన అంశాలతో కూడిన టెండర్లను తెరిచి పరిశీలించగా రెంటికీ పూర్తి అర్హతలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కనుక శుక్రవారం ఆ రెండు సంస్థలు దాఖలు చేసిన ఆర్ధికపరమైన టెండర్లను తెరిచి పరిశీలించిన తరువాత, సాంకేతిక, ఆర్ధిక టెండర్లు రెంటినీ దృష్టిలో ఉంచుకొని వాటిలో ఓ సంస్థకు కొత్త సచివాలయ నిర్మాణ పనులు అప్పగిస్తారు. ఒకవేళ రేపు టెండర్లు ఖరారు చేస్తే ఈ కాంట్రాక్ట్ దక్కించుకొన్న సంస్థ దసరా రోజున అంటే 25వ తేదీన పూజచేసి లాంఛనంగా నిర్మాణపనులు మొదలుపెట్టవచ్చు.    


Related Post