మేజర్ ట్రైలర్ విడుదల

May 09, 2022
img

అడవి శేష్ హీరోగా వస్తున్న మేజర్ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు సోమవారం విడుదల చేశారు. 26/11 ముంబై దాడులలో ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన  ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కధ ఆధారంగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. దీనిలో అడవి శేష్ మజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌గా నటించారు. దీని తెలుగు వెర్షన్‌ను మహేష్ బాబు, హిందీ వెర్షన్‌ను సల్మాన్ ఖాన్, మలయాళం వెర్షన్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ నేడు విడుదల చేశారు. ఈ సినిమా జూన్3న విడుదల కాబోతోంది. 

రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాకు మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా సోనీ పిక్చర్స్ ఇంటెర్నేషనల్ ప్రొడక్షన్స్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్‌లపై నిర్మించారు. 

ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అడవిశేష్ ఈ సినిమాకు కధ వ్రాయడం విశేషం. కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల. 


Related Post