జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా జూన్లో విడుదలవుతుందని చెప్పడంతో ఈ ఏడాది జూన్లోనే అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయం దర్శక నిర్మాతల దృష్టికి రావడంతో వారు స్పష్టత ఇస్తూ జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలిసి వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచాన్ని జయించడానికి వస్తున్నారంటూ ఓ పోస్టర్ వేశారు.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు.