కల్కి సినిమాతో భారతీయ సినీ పరిశ్రమ కూడా హాలీవుడ్ స్థాయిలో ఆలోచించి గొప్ప సినిమాలు తీయగలదని నిరూపించింది. ఇప్పుడు అటువంటిదే మరో సినిమా ‘కలియుగమ్ 2064’ రాబోతోంది.
“ప్రపంచంలో ఆహారం, నీళ్ళు, మానవత్వం లేనిరోజున.. “ అంటూ ట్రైలర్తోనే తన సినిమా కధని క్లుప్తంగా చెప్పేశాడు దర్శకుడు ప్రమోద్ సుందర్. 2064లో అంటే మరో 39 సంవత్సరాల తర్వాత ప్రపంచం పరిస్థితి ఏవిదంగా మారబోతోందో ఈ కలియుగమ్ 2064 ద్వారా చూపబోతున్నారన్న మాట! ఇటువంటి కధతో సినిమాని చక్కగా తీయగలిగితే ఇదే ట్రెండ్ మొదలైన ఆశ్చర్యం లేదు.
ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ, అస్మాల్, సంతోష్, మణి, ఆర్యలక్ష్మి, మోజెస్, మాస్టర్ రోనిత్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రమోద్ సుందర్, సంగీతం: డాన్ విన్సెంట్, కెమెరా: కె రామచంద్రన్, యాక్షన్: జీఎన్ మురుగన్, ఆర్ట్: శక్తీ వెంకట్ రాజ్, వీఎఫ్ఎక్స్ప్రెస్: సీఏ డిజిటల్ స్టూడియో చేస్తున్నారు.
ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామచ్చదరం, సిద్ధార్థ స్వయంభూ కలిసి ఈ సినిమా నిర్మించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.