ఖైదీ డైరక్టర్ తో మహేష్..?

August 04, 2020


img

కోలీవుడ్ హీరో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఖైదీ. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఇళయదళపతి విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు లోకేష్. ఈ క్రేజీ డైరక్టర్ తో క్రేజీ సినిమాను ఫిక్స్ చేసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.  

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే రాజమౌళితో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే రాజమౌళి R.R.R పూర్తి చేయడానికి టైం పడుతుంది కాబట్టి సర్కారు వారి పాట తర్వాత మహేష్ లోకేష్ కనగరాజ్ సినిమా చేస్తాడని అంటున్నారు. మరి అదే జరిగితే స్పైడర్ తర్వాత మహేష్ చేసే బైలింగ్వల్ సినిమా ఇది అవుతుంది. స్పైడర్ అంచనాలను అందుకోలేదు. మరి ఈ సినిమా అయినా సరే అంచనాలకు తగినట్టు ఉంటుందా లేదా అన్నది చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష