గజ్వేల్లోనే హరీష్‌ రావుకు నిరసనలా?

February 07, 2026


img

బీఆర్ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సిఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుకు నేడు భంగపాటు జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మల్లన్నసాగర్ నిర్వాసితులతో కలిసి కాంగ్రెస్‌ శ్రేణులు ‘హరీష్‌ రావు డౌన్ డౌన్... హరీష్‌ రావు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. 

దాంతో ఆయన వెంట వచ్చిన బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తలు కూడా సిఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఇరు వర్గాల మద్య తోపులాట కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారిని శాంతింపజేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. 

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ పరిసర గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్‌ రావు ఈ భూసేకరణలో కీలకపాత్ర పోషించారు. నాడు నయాన్న, భయాన్న రైతుల నుంచి భూములు తీసుకున్నారు. కానీ నేటికీ వారిలో చాలా మందికి వివిధ కారణాల వలన నష్టపరిహారం అందలేదు. 

కనుక హరీష్‌ రావుపై నిర్వాసితుల ఆగ్రహం సహజమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతోంది కదా? కనుక వారి నష్టపరిహారం చెల్లింపు బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా? కనుక నిర్వాసితులు తమని ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతలను కూడా నిలదీయాలి కదా? 


<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">గజ్వేల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు నిరసన సెగ<br><br>హరీష్ రావుకు వ్యతిరేకంగా మల్లన్నసాగర్ భూనిర్వాసితుల ఆందోళన<br><br>బీఆర్ఎస్ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు<a href="https://twitter.com/hashtag/HarishRao?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#HarishRao</a> <a href="https://twitter.com/hashtag/brs?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#brs</a> <a href="https://t.co/jADQE8wYHy">pic.twitter.com/jADQE8wYHy</a></p>&mdash; Telugu360 (@Telugu360) <a href="https://twitter.com/Telugu360/status/2020044886884708356?ref_src=twsrc%5Etfw">February 7, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>(Video Courtesy: Telugu 360) 


Related Post