ఎమ్మెల్సీగా మీర్జా రియాజ్ గెలుపు

April 25, 2025


img

హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఎన్నికలలో ఊహించిన్నట్లే మజ్లీస్ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఆయనకు 63 ఓట్లు రాగా, బీజేపి అభ్యర్ధి గౌతమ్‌ రావుకి కేవలం 25 ఓట్లు వచ్చాయి. కనుక ఆయనపై 38 ఓట్ల మెజార్టీతో మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించిన్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు మజ్లీస్‌కి మద్దతు ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో బిఆర్ఎస్ పార్టీ వెనక్కు తగ్గింది. అయినప్పటికీ మజ్లీస్ సొంత బలం 49 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేస్తే ఈ సీటు గెలుచుకోవాలని బీజేపి ఆశపడింది. కానీ బీజేపి అభ్యర్ధికి సొంత పార్టీకి చెందిన 25 మంది కార్పొరేటర్ల ఓట్లు మాత్రమే పడ్డాయి.


Related Post