మంగళవారం జమ్ము కశ్మీర్లో పర్యటకులపై తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భారత్ ఆర్మీ మీడియాకు విడుదల చేసింది. వీరి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ అమిత్ షా, అబూ తాలగా గుర్తించారు. వీరు ముగ్గురూ జమ్ము కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా వారి ఊహాచిత్రాలు రూపొందించి విడుదల చేశారు.
వీరు ముగ్గురి కోసం భద్రతాదళాలు గాలిస్తున్నాయి. దాడి జరిగిన కొన్ని నిమిషాలకే భద్రతా దళాలు అక్కడికి చేరుకునందున వారు ముగ్గురూ జిల్లా దాటి తప్పించుకు పోలేరని భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో వారి ఊహాచిత్రాలు వైరల్ అవుతున్నాయి. కనుక ముగ్గురు ఉగ్రవాదులు త్వరలోనే పట్టుబడటం ఖాయమే అని భావించవచ్చు.
జమ్ము కశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది చనిపోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.