సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నకు జవాబు ఉందా?

April 20, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి తెలుగు ప్రజలతో ఆత్మీయ సమావేశమైనప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. “ఢిల్లీలో వాయు కాలుష్యం.. నీళ్ళు కాలుష్యం ఏ స్థాయికి చేరుకున్నాయంటే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ఇచ్చి మూసుకోవలసి వచ్చింది. ఢిల్లీ మొత్తం స్తంభించిపోయే దుస్థితి నెలకొంది. నేడు ఢిల్లీ.. ఉపేక్షిస్తే రేపు హైదరాబాద్‌ స్తంభించిపోవచ్చు. కనుక చెరువులని కబ్జా చేసుకొని ఇళ్ళు కట్టుకున్నవారిని ఉపేక్షించవచ్చా?

టోక్యోలో ఇన్ని లక్షల వాహనాలు తిరుగుతున్నా ఎక్కడా వాయు కాలుష్యం లేదు. నగరం గుండా ఇంత పెద్ద నది పారుతున్నా ఎక్కడా చెత్తా చెదారం కనిపించవు. ఇక్కడి గాలి, నీళ్ళు ఇంత స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో కూడా ఇటువంటి చక్కటి వాతావరణం ఏర్పడాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికీ కొందరు అడ్డుపడుతున్నారు. రాజకీయాలు చేస్తూ విమర్శిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. భవిష్యత్‌ తరాలు సుఖంగా జీవించేందుకు చక్కటి పర్యావరణం అందించాల్సిన బాధ్యత మనపై లేదా?” అని ప్రశ్నించారు.


Related Post