రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిద మీడియా సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి తమ సర్వే అంచనాలను ప్రకటిస్తున్నాయి. ఇండియా టీవీ వంటి కొన్ని సంస్థలు ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 2-3 సీట్లు మించి రావని తేల్చి చెప్పేస్తే, సి-పాక్ సంస్థ సర్వేలో బిఆర్ఎస్ పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ 6, బీజేపీ 2, మజ్లీస్ ఒక ఎంపీ సీటు గెలుచుకోబోతున్నాయని వెల్లడించింది.
ఎన్నికల శాతాల ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 34.54 శాతం, కాంగ్రెస్ పార్టీకి 30.03 శాతం, బీజేపీకి 27.17 శాతం, మజ్లీస్కి 2.18 శాతం, సిపిఎంకి 0.35 శాతం, ఇతరులకు 0.77 శాతం వస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో 4.96 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించలేదని సి-పాక్ సంస్థ వెల్లడించింది.
గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికలలో సి-పాక్ సంస్థ ప్రకటించిన అంచనాలే నిజమయ్యాయి కనుక లోక్సభ ఎన్నికలలో కూడా దాని అంచనాలు ఫలిస్తాయని బిఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.