సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఇదివరకే తమ అభ్యర్ధులను ప్రకటించగా ఇప్పుడు బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. బీజేపీ అభ్యర్ధిగా టిఎన్ వంశీ తిలక్ పేరుని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు నెలల క్రితం కారు ప్రమాదంలో మరణించడంతో లోక్సభ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక కూడా జరుగబోతోంది. బిఆర్ఎస్ అభ్యర్ధిగా ఆమె చెల్లెలు లాస్య నివేదితకు కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి లాస్య నందిత చేతిలో ఓడిపోయిన నారాయణన్ శ్రీ గణేశ్, ఆ తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇప్పుడు లాస్య నివేదితతో పోటీకి సిద్దమయ్యారు.
లోక్సభ ఎన్నికలతో పాటు మే 13వ తేదీన ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగబోతోంది.