ఆ బిల్లుకు తెరాస వ్యతిరేకం...

December 09, 2019


img

కేంద్రప్రభుత్వం ఈరోజు పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న ప్రతిపక్ష సభ్యులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కొన్ని కీలక బిల్లులకు మద్దతు పలికినా తెరాస కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించింది. కనుక తమ ఏడుగురు ఎంపీలకు ఈరోజు వి‌ఐ‌పి జారీ చేసింది. తెరాస ఎంపీలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజార్టీ ఉంది కనుక ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ఎంతగా అభ్యంతరం చెప్పినప్పటికీ ఆమోదింపజేసుకోగలదు. కానీ రాజ్యసభలో బిజెపికి బలం తక్కువగా ఉంది కనుక వైసీపీ, అన్నాడిఎంకె, బిజెడి వంటి ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాజ్యసభలో కూడా ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలిగితే అది దేశంలో పెను సంచలనం సృష్టించవచ్చు. 

ఈ బిల్లు అమలులోకి వస్తే బాంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి స్థిరపడిన లక్షలాదిమంది తిరిగి స్వదేశాలకు పంపించే ప్రయత్నాలు మొదలవుతాయి. కనుక దేశంలో పెను సంచలనం సృష్టించవచ్చు. 



Related Post