ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో గురిచూసి తమా ప్రత్యర్ధులను కొట్టగలరు కానీ ప్రజల మద్యకు వచ్చి మాట్లాడమంటే ఎప్పుడూ తడబడుతూనే ఉంటారు. తరచూ నోరు జారీ నవ్వులపాలవుతునే ఉంటారు. ఇటీవల వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు ‘మేము చాలా బాధపడ్డాము’ అని అనబోయి ‘మేము చాలా పరవశించాము’ అని నవ్వులపాలయ్యారు.
మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నారా లోకేష్ గురువారం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఏప్రిల్ 9వ తేదీన జరుగబోయే ఎన్నికలు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు. అది విని పక్కనే ఉన్న టిడిపి నేతలు ఏప్రిల్ 9న కాదు 11న ఎన్నికలు అని గుర్తు చేయడంతో నారా లోకేష్ ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతున్నాయని సరిదిద్దుకొన్నారు. నారా లోకేష్ నిత్యం ఇలా నోరుజారుతూ నవ్వులపాలవుతుండటంతో టిడిపి నేతలు ఆయనను కవర్ చేయలేక తలలు పట్టుకొంటున్నారు. అయితే నారా లోకేష్ నోరుజారితే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వెంటనే చాలా చక్కగా స్పందించారు. నారా లోకేష్గారు కోరుతున్నట్లుగా ఏప్రిల్ 9న అందరూ సైకిల్ గుర్తుకే ఓట్లు వేయండి. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి,” అంటూ ట్వీట్ చేశారు.