బిజెపిలో ఒకే ఒక్కడు..తొలిరోజున అసెంబ్లీకి డుమ్మా!

January 17, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర బిజెపి 119 స్థానాలకు పోటీ చేయగా ఒకే ఒక్క చోట మాత్రమే గెలిచింది. గోషామహల్ నుంచి రాజా సింగ్ బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. కానీ ఆ ఒక్కరూ శాసనసభ తొలిరోజు సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. తాత్కాలిక స్పీకరుగా బాధ్యతలు చేపట్టిన మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈరోజు శాసనసభ సమావేశం జరుగుతుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ఈరోజు ఆయన ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే మజ్లీస్ ఎమ్మెల్యే సమక్షంలో తాను ప్రమాణస్వీకారం చేయదలచుకోలేదని కనుక తొలిరోజు శాసనసభ సమావేశానికి తాను హాజరుకాబోనని తెలిపారు.



Related Post