మాజీప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం విషమం

August 16, 2018


img

మాజీప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియగానే ప్రధాని మోడీతో సహా కాంగ్రెస్‌, బిజెపి తదితర పార్టీలకు చెందిన నేతలు ప్రజాప్రతినిధులు, వాజ్ పేయి కుటుంబ సభ్యులు, దగ్గర బందువులు ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకొంటున్నారు. ఆయనను ఐసియులో ప్రత్యేకవార్డులో ఉంచి 15మంది వైద్యబృందం చికిత్స అందిస్తున్నారు.           



Related Post