తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త!

January 16, 2023
img

తెలంగాణలో ఉపాధ్యాయులకు ఓ శుభవార్త! ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక,  విద్యాశాఖమంత్రులు హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి మొన్న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైనప్పుడు ఈవిషయం వారికి తెలియజేశారు. మరో రెండు మూడు రోజుల్లో బదిలీలు, పదోన్నతులకి సంబందించి షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం త్వరలో ఖాళీ కాబోతోంది. దానికి ఎన్నికలు నిర్వహించవలసి ఉంది కనుక ఫిభ్రవరి నెలాఖరులోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే మార్చి నెలలో వార్షిక పరీక్షలు జరిగే ముందు ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థులు వారి చదువులపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు బదిలీలకి ఉత్తర్వులు ఇచ్చి ఆ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, వేసవి సెలవు తర్వాతే ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక బదిలీలకి సంబందించి ఉత్తర్వులు వెలువడితే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

Related Post