భారత్ ఆర్మీలో అగ్నిపథ్ పధకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి సెప్టెంబర్ 3వరకు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్/ స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 23 ఏళ్ళు. అక్టోబర్ 1నాటికి 23 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసున్న వారు మాత్రమే అర్హులు. టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 31వరకు సూర్యాపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.