శనివారం హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ జాబ్మేళాలో ఇరవైకి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయి. సుమారు 2,500 ఉద్యోగాలు భర్తీ చేసుకొంటాయి. కనుక అర్హులైన అభ్యర్థులు హాజరు కావచ్చని వెస్ట్ జోన్ పోలీస్ అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.bit.ly.jcepass వెబ్సైట్లో తమ పేరు, విద్యార్హతలు తదితర వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు అమీర్ పేట మెయిన్ రోడ్, చందనా బ్రదర్స్ వెనుక కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్లో ప్రారంభమవుతుంది.
కరీంనగర్లో కూడా జాబ్మేళా
శనివారం కరీంనగర్ జిల్లాలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్మేళా పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ముందుగా www.ncs.gov.in వెబ్సైట్లో తమ పేరు, విద్యార్హతలు, సర్టిఫికెట్లను రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే జాబ్మేళాకు అనుమతించబడతారు. జాబ్మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ ఫోటోలు తీసుకు రావాలని జిల్లా ఉపాధికారి సూచించారు.
కరీంనగర్ పట్టణంలో బ్యాంక్ కాలనీలో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాబ్మేళా జరగనుంది.