సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈ నెల 23న (శుక్రవారం) జాబ్మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
జాబ్మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు, వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా తీసుకురావాలని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.
జాబ్మేళా సమయం: ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
విద్యార్హతలు: పదవ తరగతి, ఇంటర్,
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు
జాబ్మేళా జరుగు స్థలం: పాత డిఆర్డిఏ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయం, సంగారెడ్డి,
మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్:88868 82120