హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వరకు జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్)కు ఆర్టీసీ, మెట్రో ప్రత్యేక సర్వీసులను నడిపించబోతున్నాయి. ఈ ఎగ్జిబిషన్ కోసం మెట్రో సర్వీసులు రాత్రి 11.30 వరకు నడిపిస్తుండగా, ఈ నెల 12వ తేదీ వరకు నగరంలో వివిద ప్రాంతాల నుంచి ప్రతీరోజు 100 ప్రత్యేక బస్సులు నడిపించాలని టిఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. 13వ తేదీ నుంచి ఆధనంగా మరో 50 బస్సులు నడిపిస్తుంది. శలవు రోజులలో రోజుకు 200 బస్సులు నడిపిస్తామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వినోద్కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 15న ఎగ్జిబిషన్ ముగిసేవరకు ఈ ప్రత్యేక బస్సులు నడిపిస్తామని తెలిపారు.