దేశవ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనున్నందున పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ జనవరి 30 తేదీన ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.