ఏపీలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా 1,062 పాజిటివ్ కేసులు

July 08, 2020
img

పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటలలో 24,643 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,062 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 22,259కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 10,894 యాక్టివ్ కేసులుండగా నేటి వరకు మొత్తం 11,101 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో నేటివరకు మొత్తం 264 మంది కరోనాకు బలయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వలస కార్మికులలో 2,266 మందికి కరోనా సోకగా వారిలో 1,497 మంది కోలుకొన్నారు. మిగిలినవారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విదేశాల నుంచి తిరిగివచ్చినవారిలో 422 మందికి కరోనా సోకగా వారిలో 268 మంది కోలుకొన్నారు. మిగిలిన 154 మంది  ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.  

ఏపీలో నేటి వరకు అత్యధికంగా కర్నూలు (2722), అనంతపూర్ (2568), గుంటూరు (2435), కృష్ణా (1968), కడప (1440), పశ్చిమగోదావరి (1366) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 88 మంది, కృష్ణాలో 72 మంది కరోనాతో చనిపోయారని అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Related Post