తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 6,220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 1,879 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,612కి చేరింది. రాష్ట్రంలో ప్రతీరోజు కనీసం 7-8 మంది కరోనాతో మృతి చెందుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే. బుదవారం ఏడుగురు వ్యక్తులు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనతో చనిపోయినవారి సంఖ్య 313కి చేరింది. అయితే రాష్ట్రంలో ప్రతీరోజు కొలుకొంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం చాలా ఊరట కలిగిస్తోంది. బుదవారం 1,506 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 16,287 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. ప్రస్తుతం 1,879 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
జిల్లా |
7-7-2020 |
జిల్లా |
7-7-2020 |
జిల్లా |
7-7-2020 |
ఆదిలాబాద్ |
1 |
నల్గొండ |
31 |
మహబూబాబాద్ |
2 |
ఆసిఫాబాద్ |
0 |
నాగర్ కర్నూల్ |
2 |
మహబూబ్నగర్ |
11 |
భద్రాద్రి కొత్తగూడెం |
3 |
నారాయణ్ పేట |
0 |
మంచిర్యాల్ |
0 |
జీహెచ్ఎంసీ |
1,422 |
నిర్మల్ |
0 |
ములుగు |
12 |
జగిత్యాల |
2 |
నిజామాబాద్ |
19 |
మెదక్ |
12 |
జనగామ |
1 |
పెద్దపల్లి |
3 |
మేడ్చల్ |
94 |
భూపాలపల్లి |
6 |
రంగారెడ్డి |
176 |
వనపర్తి |
1 |
గద్వాల్ |
4 |
సంగారెడ్డి |
9 |
వరంగల్ అర్బన్ |
13 |
కరీంనగర్ |
32 |
సిద్ధిపేట |
1 |
వరంగల్ రూరల్ |
0 |
కామారెడ్డి |
11 |
సిరిసిల్లా |
0 |
వికారాబాద్ |
1 |
ఖమ్మం |
3 |
సూర్యాపేట |
9 |
యాదాద్రి |
0 |