తెలంగాణ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కొరకు నేటి నుంచి 2వ విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్దులతో పాటు, గతంలో సీట్లు దక్కనివారు, మెరుగైన కాలేజీలకు మారాలనుకునేవారు, గతంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వనివారు, వెబ్ ఆప్షన్లు ఇచ్చినా కాలేజీలలో చేరనివారు నేటి నుంచి తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని లింబాద్రి తెలిపారు. నేటి నుంచి ఈ నెల 22వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూలై 26వ తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్ధులు ఆరోజు నుంచే జూలై 29లోగా సంబందిత కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. గతంలో సీట్లు పొంది కాలేజీలలో రిపోర్ట్ చేయని విద్యార్దులు రూ.400 ఫీజు చెల్లించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని లింబాద్రి తెలిపారు.