మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమాన సంస్థ నిన్న అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. భారత్లో వివిధ ప్రాంతాల మద్య నడుస్తున్న దాని సర్వీసులలో ఒకవైపు టికెట్ ను కేవలం రూ.99 కి, అంతర్జాతీయ మార్గాలలో రూ.444 కే అందిస్తోంది. ఈ ధరలకు బేస్ ఫేర్, పన్నులు, సర్-ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మే నెలలో విమాన ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్లను నవంబర్ 19వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రాప్రంబం అవుతాయి. వీటిని ఎయిర్ ఏషియా అధికారిక వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇక కోల్ కతా నుంచి జోహార్ బహ్రూ వెళ్ళే ప్రయాణికులు కేవలం పన్నులు మాత్రమే చెల్లించి జీరో బేస్ ఛార్జీతో ప్రయాణించవచ్చునని ప్రకటనలో తెలిపింది.