త్వరలో మరో 90 రైళ్లు నడిపే అవకాశం

July 03, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక రైల్వేశాఖ జూన్ 1వ తేదీ నుంచి 200 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించింది. తాజాగా ఎంపిక చేసిన మరికొన్ని ప్రధానమార్గాలలో మరో 90 జతల రైళ్లను నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే ఆ జాబితా కూడా సిద్దం చేసి కేంద్రప్రభుత్వం ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆమోదిస్తే త్వరలో అవీ పట్టాలెక్కవచ్చు. కానీ రైళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజల రాకపోకలు పెరుగుతాయి కనుక కరోనా వైరస్ ఇంకా వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కేంద్రప్రభుత్వం సూచన మేరకే రైల్వేశాఖ బహుశః ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చు కనుక దీనికి కేంద్రం ఆమోదం తెలుపవచ్చు. త్వరలోనే ఈ రైళ్ళకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.   


Related Post