హైదరాబాద్ మెట్రోలో కారిడార్-3లో భాగంగా ఇప్పటి వరకు నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 29 నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు మెట్రో సర్వీసులు పొడిగించబడనున్నాయి. దీంతో మైండ్ స్పేస్ జంక్షన్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఐటి కంపెనీలలో పనిచేసే ఐటి ఉద్యోగులకు చాలా సౌకర్యం కలుగుతుంది. ఈ నెల 29న రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మైండ్ స్పేస్ జంక్షన్ మెట్రో స్టేషన్ను ప్రారంభించబోతున్నారు. మరోవైపు మెట్రోలో కారిడార్-2లోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలు వచ్చే నెలాఖరులోగా ప్రారంభించడానికి మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.