ఈనెల 26 నుంచి 28వరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయబోతున్నారు. ఆ తరువాత వరుస శలవులు వస్తాయి కనుక అక్టోబర్ 2వరకు బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేయవని బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. ఈనెల 29 ఆదివారం పడింది కనుక ఆరోజు అన్ని బ్యాంకులకు శలవు. సెప్టెంబర్ 30 ఈ నెల చివరి రోజు కనుక ఆ రోజున అకౌంట్స్, లావాదేవీలను సరిచూసుకునేందుకు అన్ని బ్యాంకులు భోజన విరామం తరువాత మూసివేస్తారు. మరుసటిరోజు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా శలవు కనుక 1వ తేదీన చాలా మంది బ్యాంక్ ఉద్యోగులు శలవులు పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆరోజున బ్యాంకులు తెరిచినప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోవచ్చు. కనుక ఆ సమయంలో బ్యాంక్ లావాదేవీలను పెట్టుకోకపోవడమే మంచిది. వీలైతే ముందుగానే అవసరమైన నగదును తీసుకొని ఉంచుకోవడం మంచిది.