హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి మొదలైన 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఆనవాయితీ ప్రకారం ఈరోజు (జనవరి 8) కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానంలో మహిళల కోసమే ప్రత్యేకంగా రంగోలీ, వాటర్ కలర్ పెయింటింట్, మెహిందీ, ఆర్టిజన్స్ పోటీలు నిర్వహిస్తామని రంగారెడ్డి తెలిపారు. మహిళలతో పాటు చిన్న పిల్లలను మాత్రమే అనుమతిస్తారు. కనుక ఈరోజు ఎగ్జిబిషన్కు వెళ్లాలనుకొంటున్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది.