మెట్రో కబుర్లు

August 08, 2018
img

హైదరాబాద్‌ నగరవాసులకు ఒక శుభవార్త. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమీర్ పేట-ఎల్బీ నగర్ కారిడార్ లో మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సర్వీసులను ప్రారభించబోతున్నారు. ప్రస్తుతం ఈ కారిడార్ లో సిగ్నలింగ్ వ్యవస్థ పరీక్షించబడుతోంది. సిగ్నలింగ్ వ్యవస్థ ఎటువంటి లోపాలు లేకుండా బాగా పనిచేస్తోందని సంబంధిత అధికారులు సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉంటుంది. ఆగస్ట్ నెలాఖరులోగా ఈ పరీక్షలు, ట్రయల్ రన్స్ వగైరా పూర్తయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించవచ్చు. ప్రస్తుతం మియాపూర్-అమీర్ పేట-నాగోల్ రెండు కారిడార్లలో కలిపి రోజుకు సుమారు 85-9,000 మంది ప్రయాణిస్తున్నారు. అమీర్ పేట-ఎల్బీ నగర్ కారిడార్ లో కూడా మెట్రో సర్వీసులు మొదలైతే రోజుకు కనీసం 1.5 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నామని ఎల్&టి మెట్రోరైల్ హైదరాబాద్‌లో లిమిటెడ్ ఎండి మరియు సీఈఓ కెవిబి రెడ్డి చెప్పారు. 


Related Post