ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఎఫ్-45 పేరుతో జిమ్ సెంటర్స్ బిజినెస్ విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో కొత్త బిజినెస్లోకి ప్రవేశించారు. హైదరాబాద్లో ‘ఆరంభం’ పేరుతో పూర్తి శాఖాహార రెస్టారెంట్ని నేడు శ్రీరామ నవమి సందర్భంగా ప్రారంభించారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు.
తమ రెస్టారెంట్లో ఆరోగ్యానికి దోహదపడే మిల్లెట్స్ తో తయారుచేసిన టిఫిన్స్ లభిస్తాయని, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, రాత్రి డిన్నర్లో హైదరాబాద్ వాసులకు నచ్చిన బిర్యానీ, సూప్స్ వగైరా లభిస్తాయని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
తెలుగులో సినిమా ఆఫర్లు తగ్గడంతో ఆమె కొంతకాలం క్రితం ముంబై వెళ్ళిపోయి తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో వ్యాపారాలపై దృష్టి పెట్టారు. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్-2 సేనిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కొన్ని హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చిన్నట్లు తెలుస్తోంది.