కామారెడ్డి జిల్లాలో సోమవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు. దీనిలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొని ఖాళీ పోస్టులకు అర్హులైన వారిని ఎంపిక చేసుకొని ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్మేళాకు హాజరుకావచ్చునని తెలిపారు. అభ్యర్ధులు తమ వెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఈ జాబ్మేళా సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది.
అర్హతలు : ఇంటర్, డిగ్రీ, పీజీ
వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారు.
జాబ్ మేళా జరుగు స్థలం : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ 121.
పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు :761974009, 8905748423, 9573381979.