నేడు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

September 28, 2021


img

గులాబ్ తుఫాన్‌తో రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కాలేజీలుమ్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వైద్య, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, పురపాలక, నీటిపారుదల తదితర అత్యవసర సర్వీసులలో ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా శాసనసభ, మండలి సమావేశాలను మూడు రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఉభయసభలు సమావేశమవుతాయి. 



Related Post