అత్యవసర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు నుంచి సికింద్రాబాద్ ప్రాంతీయ పోర్ట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి ఈనెల 21 వరకు ఈ కౌంటర్ పనిచేస్తుందని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి తెలిపారు. నగరంలో లాక్డౌన్ విధించినందున ఈ ప్రత్యేక కౌంటర్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.
కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పాస్పోర్ట్ కార్యాలయాలు మూసివేశారు. దాంతో అత్యవసర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు అనేక ఇబ్బందులకు గురయ్యారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో కేవలం 5 రోజులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.