నేడు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డెప్యూటీ మేయర్లను ఎన్నుకొనున్నారు. అలాగే సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలక సంఘాలకు ఛైర్మన్, వైరస్ ఛైర్మన్లను కూడా నేడే ఎన్నుకొనున్నారు. రెండు కార్పొరేషన్లు, ఐదు పురపాలక సంఘాలలో టిఆర్ఎస్ గెలిచినందున ఈ పదవులన్నీ ఆ పార్టీకే సొంతకానున్నాయి. పరోక్ష పద్దతిలో సాగే ఈ ఎన్నికల ప్రక్రియకు సిఎం కేసీఆర్ మంత్రులను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలలో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సిఎం కేసీఆర్ సీల్డ్ కవర్లో సూచించినవారిని ఎన్నుకొంటారు.