మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మ్రోగిస్తోంది. గత మూడు రోజుల నుంచి నేటివరకు ఇక్కడ 11 మంది కరోనా రోగులు చనిపోయారు. గత 24 గంటలలో 8 మంది చనిపోగా ఈరోజు మరో ముగ్గురు చనియారు. ఐసోలేషన్ కేంద్రంలో రోగులు చనిపోతుండటంతో బెల్లంపల్లి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.