మంథని మునిసిపల్ ఛైర్-పర్సన్‌ పుట్ట శైలజపై కేసు నమోదు

April 06, 2021


img

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ర్ పర్సన్ పుట్ట శైలజపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో విచారణలో భాగంగా గత నెల 19న నిందితుడు బిట్టు శ్రీను మంథని కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పుట్ట శైలజ నిందితుడైన బిట్టు శీనుతో వీడియో కాల్ మాట్లాడారని, అప్పుడు అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వారించిన వినలేదని మంథని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో సెక్షన్ 186 పుట్ట శైలజ పై పోలీసులు కేసు నమోదు చేశారు.



Related Post