కూకట్‌పల్లిలో గజం రూ.2.98 లక్షలు!

June 12, 2025
img

అవును! గజం ధర రూ.2.98 లక్షలు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 7వ ఫేజ్‌లో ఖాళీగా పడున్న 18 ప్లాట్లని హెచ్ఎండిఏ బుధవారం వేలం వేసింది. వాటిలో 151 చదరపు గజాలు విస్తీర్ణం ఉన్న ప్లాట్ నంబర్: 22కి వేలంపాటలో గజం రూ.2.98 లక్షలు పలికింది. 151 చదరపు గజాల స్థలానికి రూ. 4,52, 72,160 చెల్లించి ఓ వ్యక్తి సొంతం చేసుకోగా, 292 గజాల విస్తీర్ణం ఉన్న ప్లాంట్‌లో నంబర్: 19ని గజానికి రూ.2.88 లక్షల చొప్పున రూ.8,40,96,000 వచ్చింది. ఈ 18 ప్లాట్లలో 6,236 గజాలణు వేలం వెయ్యగా ప్రభుత్వానికి రూ.141 కోట్ల 36,89,100 ఆదాయం వచ్చింది. 

కేసీఆర్‌ హయంలో కోకాపేట వద్ద ఎకరం రూ.1.10 కోట్లు పలికితే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కూకట్‌పల్లిలోనే గజం రూ.2.98 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన సామాన్యుల సొంత ఇల్లు కల పగటికలగానే మిగిలిపోతుందేమో?

Related Post