మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆనంద్ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆన్లైన్లో వర్చువల్ పాడతిలో మహీంద్రా యూనివర్సిటీని ప్రారంభించారు. హైదరాబాద్ శివార్లలో బహదూర్ పల్లిలో 130 ఎకరాలలో ఈ యూనివర్సిటీని నిర్మించారు. దీనికి ఆనంద్ మహీంద్రాయే వైస్ ఛాన్సిలర్గా వ్యవహరిస్తారు. మహీంద్రా యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యానందిస్తామని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్, న్యాయశాస్త్రం, మేనేజిమెంట్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్, మీడియా తదితర విభాగాలలో డిగ్రీ, పీజీ, పిహెచ్డీ స్థాయి కోర్సులు ఉంటాయని ఆనంద్ మహీంద్రా తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచించినట్లు సృజనాత్మకత, పరిశోధనకు ఈ యూనివర్సిటీలో ప్రాధాన్యం ఇస్తామని ఆనంద్ మహీంద్రా చెప్పారు.