జూ.ఎన్టీఆర్ బామర్ధి నార్నే నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న విడుదలై అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తోంది. సినిమాలో కధ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినందున లాజికులు ఆలోచించకుండా సినిమా చూసి హాయిగా నవ్వుకోండి అని నిర్మాత నాగ వంశీ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే మ్యాడ్ స్క్వేర్ సినిమా మొదటి నుంచి చివరి దాకా కామెడీతో అందరినీ మెప్పించారు.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్, రమ్య పసుపులేటి, రఘుబాబు, సత్యం రాజేష్, అనిష్ కూరువిల్లా, మురళీధర్ గౌడ్, కార్తీకేయ సామాల, రవి ఆంథోనీ, రెబా మోనికా జాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.