లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు దూకుడు పెంచాయి. బీజేపీ ప్రత్యర్ధులను లొంగదీసుకొని పార్టీలో చేర్చుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను అస్త్రాలుగా ప్రయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
అదే చెపుతూ “అవినీతి మరకలు అంటుకున్నాయా... జాయిన్ బీజేపీ” అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాషింగ్ పౌడర్ వాణిజ్య ప్రకటన వంటిది ఒకటి రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అవినీతి మరకలు అంటుకున్నాయా... ఈడీ&సీబీఐ దాడులతో విసుగు చెంది ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం జాయిన్ బీజేపీ. ఎంత గొప్ప అవినీతి మరకలినా వెంటనే మటుమాయం! పట్టుబడని అవినీతి చెయ్యాలంటే ‘జాయిన్ బీజేపీ’!! గమనిక: ‘బీజేపీ జాయిన్’ కేవలం దేశ సంపద దోచే వారికి మాత్రమే. షరతులు వర్తిస్తాయి. ‘బీజేపీ జాయిన్’కు ముందు, తర్వాత ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇవ్వాల్సిందే,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ, మోడీ, అమిత్ షాల ఫోటోల కూడిన ఓ ఫోటో పోస్ట్ చేసింది. అది చూస్తే మోడీ, అమిత్ షాలు కూడా నవుకోకుండా ఉండలేరు. మీరూ ఓ లుక్ వేయండి.
అవినీతి మరకలు అంటుకున్నాయా?
— Telangana Congress (@INCTelangana) March 29, 2024
ఈడీ & సీబీఐ దాడులతో విసుగు చెంది ఉన్నారా?
ఇంకెందుకు ఆలస్యం జాయిన్ బీజేపి.
ఎంత గొప్ప అవినీతి మరకలైనా వెంటనే మటుమాయం!
పట్టుబడని అవినీతి చెయ్యాలంటే ‘జాయిన్ బీజేపి‘!!
గమనిక: "బీజేపీ జాయిన్" కేవలం దేశ సంపదను దోచే వారికి మాత్రమే.
షరతులు వర్తిస్తాయి:… pic.twitter.com/AQXjIEVV0u