తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టీజీపీఎస్ఎస్సీ నేడు గురుకుల పోస్టుల పరీక్షల షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలో గల గురుకుల వసతి గృహాలలో మొత్తం 581 పోస్టులకు భర్తీకి ఈ నెల 24 నుంచి 29వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రోజుకి రెండు సెషన్స్ చొప్పున కంప్యూటర్ ఆధారిత (సిఆర్బీటి) విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో పరీక్షలకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు గత ప్రభుత్వం హయంలో అంటే 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వెలువడింది. అప్పటి నుంచి వివిద కారణాలతో వాయిదా పడుతూ చివరికి రెండున్నర ఏళ్ళ తర్వాత ఇప్పుడు పరీక్షలు జరుగబోతున్నాయి.
ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు:
గిరిజన సంక్షేమ హాస్టల్ : గ్రేడ్ 1 ఆఫీసర్- 5 పోస్టులు,
ఎస్సీ సంక్షేమ హాస్టల్ : గ్రేడ్ 2 మహిళా ఆఫీసర్- 70 పోస్టులు, గ్రేడ్-2 పురుష ఆఫీసర్- 228 పోస్టులు,
బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్స్: గ్రేడ్-2-140 పోస్టులు,
దివ్యాంగుల సంక్షేమ హాస్టల్ వార్డెన్: గ్రేడ్-5 పోస్టులు, వార్డెన్ గ్రేడ్ 2-2 పోస్టులు,
చిన్నారుల సంరక్షణ గృహాలు మహిళా సూపరింటెండెంట్: 19 పోస్టులు.
ఈ పోస్టుల భర్తీకి సంబందించి పరీక్షల షెడ్యూల్ ఈవిదంగా ఉంటుంది: